Tirumala: తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. నడకదారి మార్గంలో నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. తాజాగా టీటీడీ ఈ మార్గంలో కొన్ని కీలక నిర్ణయా లను అమలు చేస్తోంది. తిరుమల- తిరుపతి పరిధిలో చిరుతల సంచారంతో కొన్ని ఆంక్షలు విధించింది. భద్రతా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రోజుల క్రితం అలిపిరి-తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు దగ్గర చిరుత సంచారంతో టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తం అయింది. చిరుతను పట్టుకొనేం దుకు ప్రయత్నాలు చేస్తూనే భక్తులకు అలర్ట్ చేస్తున్నారు.
TTD: నడిచి దర్శనంకు వచ్చే భక్తులకు అలర్ట్ – టీటీడీ కీలక మార్పులు..!!
