ఏపీలో టీచర్ల బదిలీలు- వీరికి తప్పనిసరి, వారికి మినహాయింపు..!!
ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ప్రణాళికలు రూపొందించింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల తరువాత మార్గదర్శకాలకు తుది రూపం ఇచ్చింది. ఈ నెల 15 నుంచి ఆన్లైన్ ద్వారా ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సర్వీసుకు ప్రామాణిక తేదీగా మే 31ని నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో అంధ టీచర్లకు బదిలీల నుంచి మినహాయించారు. కాగా, పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది.ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు ..