టీచర్ల బదిలీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-త్వరలో ఆ లిస్ట్ రిలీజ్..!
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురాబోతున్న ప్రభుత్వం..అంతకు ముందే వారి సర్వీస్ సీనియార్టీ జాబితాల తయారీపై ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా బదిలీలకు అవసరమైన సీనియార్టీ లెక్కింపు విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.