June 8, 2025

తాజా వార్తలు

తాజా వార్తలు

పాలకొల్లు : మంత్రి రామానాయుడుకు చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు జన్మదిన వేడుకలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు రామానాయుడుతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ చంద్రబాబు ఆశీస్సులు, క్రమశిక్షణ, స్పూర్తితో భవిష్యత్తు లో మరింత ప్రజాసేవ చేస్తానని అన్నారు.

Read More
తాజా వార్తలు

పాలకొల్లు : ప్రాంగణ ఎంపికల్లో 17 మందికి ఉద్యోగాలు

పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ కంపెనీలు నిర్వహించబడిన ప్రాంగణ ఎంపికల్లో 17 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని కళాశాల చైర్మన్ కేవిఆర్ నర్సింహారావు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో 48 మంది అభ్యర్థులు హాజరయ్యారని వారికి మౌఖిక పరీక్షలు, నైపుణ్యత కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలకు ఎంపిక చేసారన్నారు.

Read More
తాజా వార్తలు

జస్ట్ 23 నిమిషాల్లో ‘సింధూర్’ పూర్తి – పాక్ లోకి చొచ్చుకెళ్లి, నేరుగా గురి..!!

భారత సైన్యం వైపు ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. భారత్ లో ఉగ్రదాడుల పైన ప్రతీకారం ఏంటో ప్రపంచానికి చాటారు. దాదాపు అయిదు దశాబ్దాల తరువాత పాక్ భూ భాగంలోని ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం విరుచుకు పడింది. పక్కా ప్లాన్ తో అనుకున్న ముహూర్తానికి భారత్ వైమానిక దళం ఉగ్రవాద క్యాంపుల పైన క్షిపణులతో దాడి చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ ఆపరేషన్ సింధూర్ ను

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: ప్రజలకు మంత్రి సందేశం

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన పుట్టినరోజును పురస్కరించుకొని ఒక్క రూపాయి ఖర్చు, ఒక్క క్షణం వృధా చేయవద్దని తెలిపారు. మే 6న కూటమి శ్రేణులతో పాటు అధికారులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలకు ఈ సందేశాన్ని ఇచ్చారు. తన వద్దకు బొకేలు, కేకులు, స్వీట్లు, దండలు, పండ్లు వంటివి తీసుకురావద్దని, శుభాకాంక్షలు తెలిపే ప్రకటనలు ఇవ్వవద్దని వీటికి కోసం డబ్బులు, సమయాన్ని వృధా చేయవద్దని పిలుపునిచ్చారు.

Read More
తాజా వార్తలు

ఏటీఎం ఛార్జీల బాదుడు షురూ.. కొత్త ఛార్జీలు ఇవే

ఆన్ లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు పెరిగినా ఇప్పటికీ చాలా మంది ఏటీఎం ద్వారానే నగదు విత్ డ్రా చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. ఏటీఎం విత్‌ డ్రా ఛార్జీలు మే 1 నుంచి పెరగనున్నాయి. కొత్త ఛార్జీలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితిని మించి చేసే ఏటీఎం లావాదేవాలపై ఛార్జీల పెంపునకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఇతర

Read More
తాజా వార్తలు

‘పాకిస్థాన్‌ ఎడారిలా మారాల్సిందే.. చుక్క నీరు కూడా వెళ్లనీయం’

జమ్ము కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. అందులో భాగంగానే సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్థాన్ మధ్య ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. నీటిని తక్షణమే నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ

Read More
తాజా వార్తలు

ఏపీలో కొత్త పెన్షన్లు, నేటి నుంచి దరఖాస్తులు – వారికి రద్దు, మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది. తాజాగా ఈ మేరకు మార్గదర్శకాలు సిద్దం చేసింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్‌ను జూన్ నుండి అందజేస్తారు. మిగిలిన కేటగిరీలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. వచ్చే నెల తొలి వారం లో దీనికి

Read More
తాజా వార్తలు

Gold Price Today : లక్ష మార్కును దాటిన తులం బంగారం.. సామాన్యుడికి అందనంత ఎత్తులో!

బంగారం ధరలు అదుపు లేకుండా పరుగులు పెడుతున్నాయి. కేవలం పెట్టుబడి సాధనంగానే కాకుండా, భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన పసిడి, ఇప్పుడు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారుతోంది. తాజాగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులం (10 గ్రాములు) ధర ఏకంగా రూ.1,01,350కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. లక్ష రూపాయల గీతను దాటడం, బంగారం మార్కెట్‌లో పెను సంచలనంగా మారింది. సామాన్యుడిపై ప్రభావం: పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనడం మన సంప్రదాయం.

Read More
తాజా వార్తలు

ఏపీలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?

ఆంధ్రప్రదేశ్‌ లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేయగా.. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 81.14 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్స్ https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ లలో మాత్రమే కాకుండా పలు సైట్స్ లలో కూడా చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ ఏడాది ‘మన మిత్ర’ (వాట్సాప్) ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: కందుకూరి విశిష్ట పురస్కారం

పాలకొల్లు కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి, రంగస్థల నటుడు మానాపురం సత్యనారాయణ జిల్లా కందుకూరు పురస్కారానికి ఎంపికైయ్యారు. ఏప్రిల్ 16న బుధవారం కందుకూరు వీరేశలింగం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ తుమ్మలపల్లి వారి కళా క్షేత్రంలో ఈ అవార్డును అందజేయనున్నారు. రాష్ట్రంలో ముగ్గురికి రాష్ట్ర అవార్డులు, 130 మందికి జిల్లా కందుకూరు పురస్కారాలు అందజేయనున్నారు.

Read More