June 8, 2025

తాజా వార్తలు

తాజా వార్తలు

ఏపీలో కొత్త రేషన్ కార్డులపై షాక్-అసెంబ్లీలో తేల్చేసిన సర్కార్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. అసెంబ్లీ వేదికగా ఇవాళ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటో నాదెండ్ల మనోహర్ చెప్పేశారు. బీజేపీ సభ్యులు ఈశ్వరరావు, విష్ణుకుమార్ రాజు, పార్ధసారధి అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు. దీంతో కొత్తగా ఇప్పట్లో కార్డుల జారీ లేనట్లేనని తేలిపోయింది. ప్రస్తుతం బియ్యం కార్డులు

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: ఆయకట్టు ఛానల్ ప్రక్షాళన పనులు

పాలకొల్లు మండలంలో దిగమర్రు పంటకాలుపై చిట్టవరం, చీమలకోడు ఆయకట్టు ఛానల్ ప్రక్షాళన పనులు సోమవారం మొదలయ్యాయి. మంత్రి నిమ్మల రామానాయుడు రూ. 15. 75 లక్షలు నిధులు మంజూరు చేయడంతో ఈ పనులను పాలకొల్లు డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడు పెనుమత్స రామభద్రరాజు, దిగమర్రు సాగు నీటి సంఘ అధ్యక్షులు మాతా రత్నరాజు ప్రారంభించారు. ఈ పనులు జరగడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More
తాజా వార్తలు

ఎలమంచిలి: ఏటిగట్టును పరిశీలించిన ఎమ్మార్వో

యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ పరిధిలో ఏటిగట్టును యలమంచిలి తహసీల్దార్ పవన్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏటిగట్టును అనుకోని జీవిస్తున్న కుటుంబాల నుండి పలు వివరాలను తహసీల్దార్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలం టీడీపీ అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, మాజీ జడ్పీటీసీ సభ్యులు బోనం నాని తదితరులు పాల్గొన్నారు.

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: పెళ్లి వేడుకలో లోకేష్, భువనేశ్వరి, నిమ్మల.

హైదరాబాద్ ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ లో బీద రవిచంద్ర గారి కుమారుడు గోకుల్ రిష్వంత్ & దివిజ ల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆదివారం మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి తదితర ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు కలిసి పాల్గొన్నారు

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: భాదిత కుటుంబానికి ‘మనకోసం మనం’ సహాయం

పోడూరు మండలం జిన్నూరులో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యవసాయ కూలీ, కౌరు అప్పారావు భార్య నాగమణి (45), ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న మనకోసం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పడాల పెద్దిరాజు, సంఘ సభ్యులతో కలిసి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ. 3వేల ఆర్థిక సహాయాన్ని కుమారుడు కౌరు ఏసు కు అందజేసి మానవతా దృక్పధాన్ని చాటుకున్నారు. కె. నాగేశ్వరరావు, డి. దాసరి సత్యనారాయణ పాల్గొన్నారు.

Read More
తాజా వార్తలు

విజయవాడ-చిలకలూరిపేట మధ్య ప్రయాణికులకు NHAI గుడ్ న్యూస్..!

కోల్ కతా-చెన్నై జాతీయరహదారిపై విజయవాడ నుంచి చిలకలూరిపేట మధ్య ప్రయాణాలు చేసే వారికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ) గుడ్ న్యూస్ చెప్పింది. నానాటికీ రద్దీగా మారుతున్న ఈ బెల్ట్ లో ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా ఓ అత్యాధునిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. దీంతో ఇకపై ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాలు చేసే వారికి ట్రాఫిక్ తో పాటు ఇతర సమస్యలకు చెక్ పడనుంది. ఎన్ హెచ్ ఏ

Read More
తాజా వార్తలు

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..! కూటమికి టెన్షన్..?

తాజాగా ఏపీ శాసనమండలిలో ఖాళీ అవుతున్న మూడు సీట్లకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులో రెండు గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ సీట్లతో పాటు మరో టీచర్స్ ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ సీటు ఉన్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. అలాగే ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీతో పీడీఎఫ్, యూటీఎఫ్ పోటీపడ్డాయి. వైసీపీ పోటీకి దూరంగా ఉంది. ఉత్తరాంధ్ర టీచర్స్

Read More
తాజా వార్తలు

ఏపీలో వాహనదారులకు రేపట్నుంచి షాకులే- తేడా వస్తే భారీ జరిమానాలు..!

ఏపీలో వాహనదారులకు పోలీసుశాఖ షాకిచ్చింది. మోటారు వాహనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ అందులో నిబంధనల్ని పాటించకుండా యథేచ్ఛగా రహదారులపై వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపిస్తున్నారు. దీంతో రేపటి నుంచి ఏపీలో వాహనాలు నడిపేవారు ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ సహా అన్ని పత్రాలు, హెల్మెట్ తీసుకుని వెళ్లాల్సిందే.

Read More
తాజా వార్తలు

ప. గో. జిల్లాలో 69. 80 శాతం ఓటింగ్

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. పశ్చిమగోదావరిలో 70,052 మంది ఓటర్లకు 48,893 మంది ఓటింగ్ లో పాల్గొనగా 69.80 శాతం నమోదైంది. అదేవిధంగా పాలకొల్లులో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.

Read More
తాజా వార్తలు

పాలకొల్లులో పవర్ కట్

పాలకొల్లులో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలుపుతున్నట్లు ఆ శాఖ ఏఈ కె మధు కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 33/11 కేవీ పాలకొల్లు సబ్ స్టేషన్‌లో 11కేవీ పాలకొల్లు టౌన్-1 ఫీడర్ మరమ్మతుల కారణంగా టౌన్ పరిధి‌లోని వరిధనం రోడ్డు, మెయిన్ రోడ్, శంభుని పేట, పెదగోపురం ప్రాంతం, పోస్ట్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ తెలిపారు.

Read More