apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ CBSE: సీబీఎస్ఈలో కీలక సంస్కరణలు-ఆ క్లాస్ కు క్యాలిక్యులేటర్ల అనుమతి..!
ఎడ్యుకేషన్ & కెరీర్

CBSE: సీబీఎస్ఈలో కీలక సంస్కరణలు-ఆ క్లాస్ కు క్యాలిక్యులేటర్ల అనుమతి..!

2025-26 విద్యా సంవత్సరానికి ప్రాథమిక విద్యలో పలు సంస్కరణల్ని సీబీఎస్ఐ ప్రకటించింది. ముఖ్యంగా 12వ తరగతి అకౌంటెన్సీ విద్యార్థులకు ప్రాథమిక, నాన్-ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్‌లను ఉపయోగించడాన్ని కేంద్ర ప్రాథమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) ఆమోదించింది. బోర్డు 140వ పాలక మండలి సమావేశంలో సీబీఎస్ఈ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.సీబీఎస్ఈ చేపడుతున్న సంస్కరణల్లో మూల్యాంకన పద్ధతులు, సిలబస్ నిర్మాణంతో పాటు పలు మార్పులున్నాయి. 12వ తరగతి విద్యార్ధులకు కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం, శాతాల గణనలు వంటి ఆప్షన్లు ఉన్న ప్రాథమిక కాలిక్యులేటర్‌లు మాత్రమే అనుమతించబడతాయి. అలాగే డిజిటల్ మూల్యాంకనం, ఆన్-స్క్రీన్ మార్కింగ్ సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాంకనం కోసం ఓఎస్ఎమ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. వీటి ద్వారా జవాబు పత్రాలను స్కాన్ చేసి మార్కింగ్ కోసం అప్‌లోడ్ చేస్తారు.

Exit mobile version