ఏపీలోని పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాల్య సంరక్షణ, విద్యపై అంగన్వాడీ టీచర్లకు 120 రోజుల సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 మంది అంగన్వాడీ టీచర్లకు ఈ శిక్షణ అందించనున్నారు. ఇందులో భాగంగా ప్రథమ్ సంస్థ ద్వారా ఆరు రోజుల ఆఫ్లైన్ శిక్షణను మంగళవారం నుంచి ప్రారంభించారు.
