AP DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఏప్రిల్ మొదటి వారంలో ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని.. జూన్లో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచేలోపు నియామకం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు కేబినెట్లోనూ తీర్మానం కూడా చేసింది. అయితే.. కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా కొద్ది ఆలస్యమైంది.
Chandrababu Naidu : ఏప్రిల్ ఫస్ట్వీక్లో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2025 విడుదల.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
