apollonews.in Blog ఆరోగ్యం డయాబెటిస్ పేషెంట్స్ వేసవిలో ఈ పండ్లు తింటే మంచిది!!
ఆరోగ్యం

డయాబెటిస్ పేషెంట్స్ వేసవిలో ఈ పండ్లు తింటే మంచిది!!

డయాబెటిస్ పేషెంట్లు మన సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, విపరీతమైన పని ఒత్తిడి కారణంగా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇక డయాబెటిస్ బారిన పడినవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.డయాబెటిస్ పేషంట్స్ పండ్లు తినడం మంచిదే కానీ అన్ని రకాల పండ్లను తినకూడదు. ఒకవేళ పండ్లను తిన్నా కూడా పరిమిత మోతాదులోనే తినాలి. ఇక వేసవి కాలంలో కొన్ని రకాల పండ్లు తినడం డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుంది. మరి ఆ పండ్లు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.డయాబెటిస్ పేషంట్స్ జామపండు ఎక్కువగా తినడం మంచిది. జామ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. జామ పండు రక్తంలోని చక్కెరను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.

Exit mobile version