పాలకొల్లు చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 22న దివిస్ లేబొరేటరీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు బీఎస్సీ, బీటెక్, ఎంఎస్సీ, బి. ఫార్మసీ, ఎం. ఫార్మసీలలో ఉత్తీర్ణులై, 21-25 వయస్సు ఉండాలన్నారు. పురుష అభ్యర్థులు అర్హులని ఆయన వివరించారు.
