రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే డీఎస్సీలో పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు పొందేలా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులను ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ శిక్షణలో 650 మందికి సబ్జెక్టుల వారీగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందే నిరుద్యోగ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.