రాజస్థాన్ ఉదయపూర్లో మంత్రి రామానాయుడుకు అపూర్వ గౌరవం దక్కింది. రెండు రోజులు పాటు జరిగే ఈ సమావేశాల్లో మొదటిరోజు ఆయన వికసిత భారత్ 2047లో భాగంగా జల సంరక్షణ అంశాలపై మాట్లాడి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి రామానాయుడు మాట్లాడిన తీరు, ప్రజెంటేషన్ విధానం పై వేదికపై ఉన్న ఒరిస్సా సీఎంతో సహా అందరూ ప్రశంసించారు. వేదిక కింద కూర్చున్న ఐఏఎస్ అధికారులు సైతం బాగా ప్రిపేర్ చేసి ప్రజెంటేషన్ చేశారంటూ అభినందనలు తెలిపారు.
