Republic Day 2025 Speech : రిపబ్లిక్ డే వేడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించింది.
Republic Day 2025 Celebrations : జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోజు ఉదయం అన్ని స్కూళ్లల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఆదేశించారు. హెడ్మాస్టర్లు, విద్యాసంస్థల ప్రధానాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. Republic Day రోజున విద్యార్థులు ఉదయం జాతీయ గీతం ఆలపిస్తూ మార్చ్ పాస్ట్ నిర్వహించాలని సూచించారు.
ఈ ఏడాది జనవరి 26వ తేదీన భారత 76వ గణతంత్ర దినోత్సవానికి (Republic Day 2025) ముఖ్య అతిథిగా ఇండోనేషియా (Indonesia) అధ్యక్షుడు ప్రభోవొ సుబియాంతో (Prabowo Subianto) హాజరు కానున్నారు. అలాగే.. ఇండోనేషియాకు చెందిన 190 మంది సభ్యుల బ్యాండ్ కంటింజెంట్ కూడా భారత త్రివిధ దళాలతో కలిసి కర్యవ్య పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొననుంది. ఇండియా కీలక విధానమైన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో కీలక భాగస్వామిగా ఇండోనేషియా ఉన్న విషయం తెలిసిందే. 2024 అక్టోబర్లో దేశాధ్యక్షుడుగా ప్రభోవొ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్లో పర్యటించనుండటం ఇదే మొదటి సారి.