మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిలాసట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.
Leave a Comment