దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఓవైపు దేవర పార్ట్ 2 ఉండగా మరోవైపు వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ తన అభిమానుల్ని కలిసి చాలా కాలం అయిపోయింది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమ హీరోని తనివితీరా చూద్దామనుకున్న ఫ్యాన్స్కి నిరాశ తప్పలేదు. సెక్యూరిటీ కారణాల వల్ల అప్పుడు ఆ ఈవెంట్ రద్దయింది. దీనిపై తారక్ కూడా చాలా చింతించారు. అయితే తాజాగా తన ఫ్యాన్స్కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు ఎన్టీఆర్.
త్వరలోనే అభిమానులతో సమావేశం కానీ.. జూ. ఎన్టీఆర్ కీలక ప్రకటన
