భారత్ – పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వద్ద పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత గస్తీ దళాల మీద కాల్పులకు తెగ బడింది. ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టింది. ఉగ్రవాదుల కోసం సైన్యం భారీ స్థాయిలో కూంబింగ్ చేస్తున్నారు. దాడిలో పాల్గొన్న వారిగా భావిస్తున్న ఉగ్రవాది ఇంటిని సైన్యం పేల్చి వేసింది. రెండు దేశాల నిర్ణయాలతో బోర్డర్ లో ఉద్రిక్తత పెరుగుతోంది. ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. అటు కఠినంగా దౌత్య పరమైన నిర్ణయాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఆర్మీ చీఫ్ పహల్గాం చేరుకుంటున్నారు.
పహల్గాం దాడి ఉగ్రవాదుల ఇళ్లపై సైన్యం మెరుపు దాడి, పేల్చివేత..!!
