ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరో హీరోయిన్లు ప్రేమలో మునిగి తేలడమో , లేదంటే పెళ్లి పీటలెక్కడమో చేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఎవరో ఒక సెలబ్రెటీ కొత్త జీవితంలోకి అడుగుపెడుతూనే ఉన్నారు. సినీ ప్రముఖులతో పాటు బుల్లితెర నటులు కూడా పెళ్లీ పీటలెక్కుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ శుభవార్త చెబుతారోనని వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ బుల్లితెర నటి హల్దీ వీడియోతో సైలెంట్గా షాకిచ్చారు.
కర్ణాటకకు చెందిన యష్మీ గౌడ కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ వైపు వచ్చారు. మిస్ మైసూర్, మిస్ ఫోటోజెనిక్ ఫేస్ టైటిల్స్ని అందుకుంది. సరదాగా ఓ రోజున అడిషన్కు వెళ్లిన యష్మీకి అనుకోకుండా విద్యా వినాయక అనే ధారావాహికలో అవకాశం దక్కింది. ఈ సీరియల్లో తన అందం, క్యూట్ లుక్స్, నటనతో ఆకట్టుకున్న యష్మీ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కన్నడలో పలు సీరియల్స్లో నటించిన ఆమెకు తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి పిలుపొచ్చింది. తొలుత ఈటీవీలో ప్రసారమైన స్వాతి చినుకులులో నటించిన యష్మీ గౌడ.. ఆ తర్వాత నాగభైరవిలో లీడ్ రోల్లో నటించింది.
ఈ నేపథ్యంలో యష్మీగౌడకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లికూతురిలా ముస్తాబైన యష్మీకి ముత్తయిదువులు గంధం రాసి , మంగళ స్నానం చేయించినట్లుగా ఆ వీడియో ఉంది. ఇది చూసిన నెటిజన్లు యష్మీగౌడకి పెళ్లయ్యిందా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది నిజం పెళ్లి కాదని, ఏదో సీరియల్ కోసం చేసిన చిత్రీకరణ అని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా యష్మీగౌడ త్వరగా పెళ్లి పీటలు ఎక్కాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
