ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని విజ్ఞాన విహార యాత్రలకు పంపించనుంది. నైపుణ్యాభివృద్ధి, మనోవికాసం, శాస్త్రసాంకేతిక రంగాలపై ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్తో పాటుగా రాష్ట్రేతర ప్రాంతాలకు విజ్ఞాన, విహార యాత్రలకు విద్యార్థులను తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,784 మంది స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్లనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.2వేలు, ప్రభుత్వం ఉత్తర్వులు
