రైల్వేలో మరో కొత్త అధ్యయం ప్రారంభం కానుంది. సరి కొత్త టెక్నాలజీతో రూపు దిద్దుకుంటున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. వందేభారత్ రైళ్లకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో, దూరపు ప్రాంతాలకు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశ పెట్టేలా కార్యాచరణ సిద్దం చేసారు. ఇప్పటికే ఈ రైళ్ల తయారీ .. ట్రయిల్ రన్ పూర్తయింది. తొలి విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వందేభారత్ స్లీపర్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా రైల్వే అధికారులు రూట్ ఖరారు చేస్తూ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందేభారత్ స్లీపర్ – రూట్ ఖరారు..!!
