apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ PPC 2025 Live : పరీక్ష పే చర్చ అప్‌డేట్స్‌.. పీఎం నరేంద్ర మోదీతో కలిసి సందడి చేయనున్న సెలబ్రిటీలు
ఎడ్యుకేషన్ & కెరీర్

PPC 2025 Live : పరీక్ష పే చర్చ అప్‌డేట్స్‌.. పీఎం నరేంద్ర మోదీతో కలిసి సందడి చేయనున్న సెలబ్రిటీలు

Pariksha Pe Charcha 2025: ప్రధాని మోదీ (PM Modi)తో సంభాషించాలనే వారు ఎదురుచూస్తున్న పరీక్ష పే చర్చ 2025 కార్యక్రమం నిర్వహణ తేదీ రానే వచ్చేసింది. పరీక్షా కార్యక్రమంపై చర్చ 2025 ఫిబ్రవరి 10న నిర్వహించనున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) విద్యార్థులకు బోర్డు పరీక్షలకు సంబంధించిన చిట్కాలు ఇచ్చేందుకు, విద్యార్థుల్లో పరీక్షల భయం పోగోట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం PPC 2025 శైలి పూర్తిగా మారిపోయింది. పరీక్షా పే చర్చ 8వ ఎడిషన్ 8 ఎపిసోడ్‌లలో ప్రసారం అవుతుంది. మొదటిసారిగా ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పలు రంగాల ప్రముఖులు సందడి చేయనున్నారు.

Exit mobile version