తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమని.. టీటీడీ మే నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తోంది. టీటీడీ ఇవాళ (ఫిబ్రవరి 22న) మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఇవాళ (ఫిబ్రవరి 22) ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఇవాళ (ఫిబ్రవరి 22న) మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తారు.
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం, గదులు బుక్ చేస్కోండి.. అద్భుత అవకాశం
