Mahakumbh 2025: మహా కుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ప్రయాగ్రాజ్లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న భక్తులతో ఈ సిటీ క్రిక్కిరిసిపోతోంది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకుంటోన్న జనం గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు.
ఇప్పటికే పుణ్యస్నానాలను ఆచరించిన వారి సంఖ్య 50 కోట్లను దాటింది కూడా. 60 కోట్లకు చేరువ అవుతోంది. ఈ నెల 21వ తేదీ నాటికి 59.31 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉదయం 8 గంటల వరకు 33 లక్షలమంది ప్రయాగ్రాజ్కు చేరుకున్నారంటే- భక్తుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.