కంట కన్నీరొలికిస్తున్న శ్రీతేజ్ పరిస్థితి
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో నాలుగోతేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 32 సంవత్సరాల మహిళ మృతి చెందింది. అదే ఘటనలో ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో 56 రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. ఈరోజు వరకు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. దీనిపై ఆ బాలుడి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. పుష్ప2 సినిమా బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య