June 8, 2025

తాజా వార్తలు

తాజా వార్తలు

యలమంచిలి: ఇంట్లో బంగారు ఆభరణాలు చోరి.

ఇంట్లోని బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఒక మహిళ పోలీసులను ఆశ్రయించారు. యలమంచిలి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీరువాలో ఉంచిన సుమారు రూ. 1. 40 లక్షల విలువ చేసే 7 కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదని గగ్గిపర్రుకి చెందిన వింజమూరి దేవి ఈనెల 2న గుర్తించారు. ఈ మేరకు ఆమె ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై గురయ్య తెలిపారు.

Read More
తాజా వార్తలు

పోడూరు మండల మహిళా అధ్యక్షురాలుగా దేవరపురేఖా దేవి

భారతీయ కాపు సేవా సమితి పాలకొల్లు నియోజకవర్గం పోడూరుమండలం, మండల మహిళా అధ్యక్షురాలుగా దేవరపు రేఖాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు ( కన్నా) నియామక పత్రాన్ని రేఖా దేవి నియమిస్తూ నియామక పత్రాన్ని శనివారం పాలకొల్లు కేంద్ర కార్యాలయంలో జాతీయ మహిళా కన్వీనర్ వన్నెంరెడ్డి భవానితో కలిసి అందజేసినారు.

Read More
తాజా వార్తలు

మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. సోమవారం ప్రయాగ్‌రాజ్‌కు రాష్ట్రపతి వెళ్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించడంతోపాటు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటన వెలువరించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిబ్రవరి 10న ఉదయం ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ప్రార్థనలు చేస్తారు. అనంతరం బడే హనుమాన్

Read More
తాజా వార్తలు

మగాళ్లకూ డ్వాక్రా సంఘాలు – రుణాలు, అర్హతలు..!!

డ్వాక్రా సంఘాలు ఇప్పటి వరకు మహిళలకే పరిమితం. ఇక నుంచి పురుషులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చిన విధంగానే ఆర్దిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. పొదుపు సంఘాల వారీగా పురుషులు తమ స్వయం ఉపాధి పొందేలా ఈ నిర్ణయం రూపకల్పన చేసారు. రాష్ట్రంలో విజయవాడ – విశాఖలో ఏప్రిల్ లో ఈ పురుష డ్వాక్రా సంఘాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే వెయ్యి సంఘాలు ఏర్పాటు దిశగా రంగం సిద్దమైంది. 25

Read More
తాజా వార్తలు

తల్లికి వందనం, రైతులకు భరోసా అమలు ఇక అప్పుడే.!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ పథకాల అమలు పైన మంత్రివర్గ భేటీలో చర్చించారు. నాలుగు నెలల కాలంలో మూడు హామీల అమలుకు నిర్ణయించారు. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. కాగా, తాజాగా తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాలను వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు

Read More
తాజా వార్తలు

కొవ్వలి సేవలు అభినందనీయం – భాస్కర్ నాయుడు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు గారి నివాసం వద్ద సంకు భాస్కర్ నాయుడు, మల్లాడి మూర్తి, నంద్యాల బాబు, Md.మౌలాలి ఫిబ్రవరి నెలకు సంబంధించి కొవ్వలి ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరుకులను పేద మహిళలకు అందజేశారు. అనంతరం భాస్కర్ నాయుడు గారు మాట్లాడుతూ కొవ్వలి ఫౌండేషన్ స్థాపించిన దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రతి నెల నిరుపేదలకు అవసరమైన నిత్యవసరసరుకులు, మందులు, అర్హులైన వారికి ఆపరేషన్లు

Read More
తాజా వార్తలు

ASNM Govt. డిగ్రీ కాలేజ్ లో విజయ ల్యాబ్ అధినేత కొమ్ముల మురళీకృష్ణ గారికి సత్కరo

ఈరోజు మన పాలకొల్లు ASNM Govt. డిగ్రీ కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల సమక్షంలో పూర్వ విద్యార్థి విజయ ల్యాబ్ అధినేత కొమ్ముల మురళీకృష్ణ గారికి జిల్లా కలెక్టర్ నాగరాణి గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా కాలేజీ తరఫున సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రాజరాజేశ్వరి గారు మరియు లెక్చరర్స్ మరియు JCI Members పాల్గొన్నారు

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: మొబైల్ దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు

పాలకొల్లు పట్టణంలో పలు మొబైల్ దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొబైల్ షాపులలో మొబైల్ పార్ట్స్, తదితర వస్తువులపై ఎమ్మార్పీ ధర లేకపోవడం, బ్రాండ్ లేకపోవడంపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎస్ఐ కె. సీతారాము, లీగల్ అండ్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ టి. రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు.

Read More
తాజా వార్తలు

24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

AP: ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాలు మూడు వారాలకుపైగా నిర్వహించవచ్చని సమాచారం. మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఏ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ వారంలోగా క్లారిటీ రానుంది. పలు అంశాలపై ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుని శాసనసభ వ్యవహారాల సలహామండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.

Read More
తాజా వార్తలు

పాలకొల్లు లో తుపాకీతో కాల్చుకుని తణుకు ఎస్ ఐ మూర్తి మృతి

తణుకు:పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎస్సై ఎ.జి.ఎస్.మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఎస్సై జిల్లా హెడ్క్వార్టర్స్ కు ఇటీవల రిపోర్ట్ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన సిఎం బందోబస్తు కు హాజరుకావాల్సి ఉంది కానీ ఉదయం తుపాకీతో కాల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

Read More