యలమంచిలి: ఇంట్లో బంగారు ఆభరణాలు చోరి.
ఇంట్లోని బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఒక మహిళ పోలీసులను ఆశ్రయించారు. యలమంచిలి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీరువాలో ఉంచిన సుమారు రూ. 1. 40 లక్షల విలువ చేసే 7 కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదని గగ్గిపర్రుకి చెందిన వింజమూరి దేవి ఈనెల 2న గుర్తించారు. ఈ మేరకు ఆమె ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై గురయ్య తెలిపారు.