Half Day Schools in AP 2025 : మార్చి ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతున్నాయ్. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు సమచారం. దీనికి సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. ఎండల తీవ్ర పెరుగుతున్నందున ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఈ అంశంపై మరింత స్పష్టత రానుంది.
Half Day Schools : మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు!
