తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖుల కార్యాలయాలపై నాలుగు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్త్రతంగా దాడులు నిర్వహిస్తున్నారు. 55 మంది అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి ఒకేసారి అన్ని ప్రాంతాల్లో సమన్వయంతో వీటిని చేపట్టారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీస్, నెక్కంటి శ్రీధర్, మ్యాంగో మీడియా రామ్ తదితరుల కార్యాలయాలపై, ఇళ్లల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. వీటితోపాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి పత్రాన్ని కూలంకుషంగా పరిశీలిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐటీ అధికారులు ఎంతో పకడ్బందీగా దాడులు నిర్వహించడంతోపాటు ప్రతి అంశాన్ని, ప్రతి రూపాయిని కూలంకుషంగా పరిశీలిస్తున్నారు.
Leave a Comment