ఇక నుంచి ఏటా రెండు సార్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించే విషయమై సీబీఎ్సఈ విడుదల చేసిన ముసాయిదా విధానంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రకారం ప్రథమ భాషగా ఇంగ్లిష్, ద్వితీయ భాషగా హిందీ, ఐచ్ఛికభాషలుగా ప్రాంతీయ, విదేశీ భాషలు ఉండనున్నాయి. దీన్ని చూస్తుంటే ఇంగ్లిష్, హిందీ తప్పనిసరి భాషలుగా చదవాల్సి ఉంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయని పలువురు అంటున్నారు. ఇంగ్లిష్, హిందీ పరీక్షలకు నిర్ణీత తేదీలను కూడా ప్రకటించారు. మిగిలిన అన్ని భాషలకు ఒక్క రోజే పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. దీని ప్రకారం హిందీ తప్పనిసరి అన్న అభిప్రాయం కలుగుతోంది.
CBSE: సీబీఎస్ఈ పదో తరగతిలో ఇంగ్లిష్, హిందీ తప్పనిసరా?
