భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమికి చేరుకున్నారు. గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన ఆమె.. ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్లో వారిద్దరూ కేవలం 8 రోజుల పని కోసమే వెళ్లారు. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో క్యాప్సూల్ వ్యోమగాములు లేకుండానే భూమిని చేరుకుంది. దాంతో సునీతా విలియమ్స్, విల్మోర్ అప్పటినుంచి ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తెలుసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఏవి సక్సెస్ కాలేదు. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములను ఎట్టకేలకు స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ భూమిపైకి సురక్షితంగా తిరిగి తెచ్చింది.
అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు.. సునీత విలియమ్స్ రాకపై చిరు రియాక్షన్
