జిల్లాలో ఉద్యానవన పంటల ప్రోత్సాహానికి రైతులను గుర్తించి, ఉపాధి హామీ పథకం ద్వారా నూరు శాతం సబ్సిడీ అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఉద్యాన పంటలకు నూరు శాతం సబ్సిడీ రుణాలు అందించే విధానంపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
