apollonews.in Blog జాతీయ వార్తలు కళ్లముందే ఉగ్రమూకలు.. ఒళ్లంతా రక్తంతో ఛిద్రం అయినా.. రోమాలు నిక్కపొడిచే వీడియో భయ్యా
జాతీయ వార్తలు

కళ్లముందే ఉగ్రమూకలు.. ఒళ్లంతా రక్తంతో ఛిద్రం అయినా.. రోమాలు నిక్కపొడిచే వీడియో భయ్యా

కళ్లముందే ఉగ్రమూకలు దాడి చేస్తున్నాయి. అభం శుభం తెలియని ఆ పర్యాటకులను కాల్చి చంపేస్తున్నాయి. ఏం జరుగుతుందో అని తెలిసేలోపే టూరిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. చిన్నా పెద్దా అని చూడకుండా ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. ఈ మారణకాండలో ఓ పిల్లాడి ఏడుపు.. ఆర్తనాదాలు.. ఓ వైపు బుల్లెట్ల సౌండ్.. మరోవైపు దిక్కుతోచని స్థితిలో ఆ చిన్నారి ఆర్తనాదాలు. ఇదీ అప్పటివరకు అక్కడి పరిస్థితి.

టెర్రరిస్టులు జరిగిన ఉగ్రదాడిలో గాయాలపాలై దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్న ఆ బాలుడికి దేవుడిలా చేయి అందించాడు ఓ కశ్మీరీ యువకుడు. గాయపడ్డ బాలుడ్ని భుజాలపై వేసుకోని కిలోమీటర్లు అలాగే పరిగెత్తి ప్రాణాలు కాపాడాడు. మరి కొద్ది సేపు అక్కడే ఉంటే ప్రాణాలు కోల్పోయే ఆ బాలుడికి పునర్జన్మ ఇచ్చాడు ఆ కాశ్మీరీ యువకుడు. మనుషుల్లో మానవత్యం ఇంకా మిగిలే ఉంది అని అనడానికి ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం.

కాశ్మీర్ కు చెందిన ఓ యువకుడు బాలుడ్ని ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఓ వైపు రాక్షస మూకలు ప్రజల ప్రాణాలు తీస్తుంటే.. ఓ భారతీయ యువకుడిగా వాళ్లకు ఎదురొడ్డి బాలుడి ప్రాణాలు కాపాడాడా ఆ యువకుడు. ఈ క్రమంలో అందరూ అతడికి సెల్యూట్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కపొడుస్తాయి ఎవరికైనా. బహూశా ఇలాంటి వీడియో మీరు ఇంతకు మందు ఎప్పుడూ చూసి ఉండరేమో అనిపిస్తుంది.

ఈ సాహసోపేతమైన దృశ్యాలను ఎక్స్ ఖాతాలో ఇనమా ఉన్ నబీ అనే వ్యక్తి షేర్ చేశారు. ఓవైపు ఉగ్రదాడి జరుగుతుంటే.. అంతకుమించిన మానవత్వం ప్రదర్శించాడు ఓ కాశ్మీరీ యువకుడు. ప్రాణాలు పణంగా పెట్టి గాయపడ్డ ఓ టూరిస్ట్ బాలుడ్ని కాపాడాడు. ఇది రియర్ కాశ్మీర్ అంటే. దేశం కోసం ప్రాణాలు ఇస్తాం. అని భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో భారతీయుల హృదయాలను కలచివేస్తోంది. ఎంతైనా ఈ యువకుడి చేసిన పనికి సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

ఇక మంగళవారం జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 28 మంది టూరిస్టులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా అభివర్ణించాయి. అటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. త్వరలోనే ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఉగ్రమూకలకు బదులు చెప్తామని అన్నారు.

Exit mobile version