apollonews.in Blog ఆరోగ్యం సమ్మర్ లో ప్రతిరోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఆరోగ్యం

సమ్మర్ లో ప్రతిరోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఎండల వేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఏదైనా చల్లగా తినాలని మనకు సాధారణంగా అనిపిస్తుంటది. అయితే ఈ సమయంలో చాలామంది ఐస్ క్రీం, చెరుకు రసం, పచ్చకాయ వంటి రకరకాల చల్లటి పదార్థలు తింటుంటారు. అయితే వీటన్నింటికన్నా పెరుగు తినడం ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు.పెరుగు..శరీరాన్ని చల్లబరచ్చడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వాస్తవానికి పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదే అని మనకు తెలిసినప్పటికీ ఎండాకాలంలో ప్రతి రోజూ దీన్ని తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయంట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది పెరుగులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎండాకాలంలో శరీరరం కోల్పోయిన తేమని తిరిగి నింపడానికి సహాయపడుతుంది.

తక్షణ శక్తి పెరుగులో ఉండే పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వేసవిలో నీరసంగా అనిపించకుండా చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది సాధారగా సమ్మర్ సీజన్ లో గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుదల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)ప్రకారం.. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎండాకాలంలో వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడానికి పెరుగులోని పోషకాలు, ప్రోబయోటిక్స్ సహాయపడతాయి.

చర్మానికి మేలు పెరుగుని ముఖానికి పట్టించడం వల్ల చర్మంపై ఏర్పడిన టానింగ్ తగ్గుతుంది,చల్లగా అనిపిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది.పెరుగుని శనగపిండి,పసుపుతో కలిసి ముఖానికి రాయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, చర్మానికి సహజమైన కాంతి వస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది కొన్ని అధ్యయనాల ప్రకారం పెరుగు తీసుకోవడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవల్స్ మెరుగుపడతాయి. ఫలితంగా గుండె సంబంధిత సమస్యల ప్రభావం తగ్గుతుంది.

Exit mobile version