apollonews.in Blog ఆరోగ్యం ఎండాకాలం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇది తినాల్సిందే, ఎలా చేసుకోవాలో చెప్తాను రండి!
ఆరోగ్యం

ఎండాకాలం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇది తినాల్సిందే, ఎలా చేసుకోవాలో చెప్తాను రండి!

ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండాకాలం ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన వంటకం ఏదైనా ఉందంటే, అది రాగి అంబలి. ఎండాకాలం దీనిని తాగడం వలన శరీరానికి ఎంతో ప్రయోజనాలు చేకూరుతాయి. దీనిని తాగడం వలన శరీరం చల్లబడడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎంతో లభిస్తాయి. చాలా మందికి దీనిని సరైన రీతిలో ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈరోజు ఈ స్టోరీలో రాగి అంబలి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

కావలసినవి: 1 కప్పు రాగులు 1/2 లీటరు పెరుగు 2 లీటర్ల నీరు 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు

తయారు చేసే విధానం అర లీటరు పెరుగులో అర లీటరు నీరు వేసి కలపాలి. తర్వాత దానిని గరిటెతో తిప్పుతూ కదిలించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో రాగి పిండి తీసుకుని, దానికి అర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఇలా కలుపుతున్నప్పుడు, ముద్దగా ఉండకూడదు.తరువాత అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకొని మరిగించాలి. నీళ్లు మరిగేటప్పుడు, కలిపిన పిండిని వేసి బాగా కలపాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి. రాగులు మాల్ట్ లాగా మారినప్పుడు, మంటను ఆపివేయండి. రాగులు చల్లబడిన తర్వాత, పెరుగులో నీళ్లు పోసి, కలిపి, మజ్జిగ వేసి, మళ్ళీ కలపండి. తరువాత దీన్ని ఒక మట్టి గ్లాసులో పోసుకోవాలి. అనంతరం దానిపై ఉల్లిపాయ, పచ్చి మిరపకాయలను వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి అంబలి సిద్ధమైనట్లే.

Exit mobile version