వేసవి తీవ్రత అప్పుడే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. పొడి గాలుల ప్రభావంతో ఎండ తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో నా నాలుగు రోజుల పాటు ఇదే రకంగా ఎండలు ఠారెత్తించే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో, పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేసింది. దేశంలోనే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో ఉదయం వేళ పొగమంచు కొనసాగుతోంది. దీంతో, ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పెరిగిన ఉష్ణోగ్రతలు, దేశంలోనే రికార్డు- ఈ జిల్లాలకు తాజా అలర్ట్..!!
