apollonews.in Blog సినిమా విజయ్ దేవరకొండపై దేశ ద్రోహం కేసు..?
సినిమా

విజయ్ దేవరకొండపై దేశ ద్రోహం కేసు..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన నోటి దురుసుతో ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పటికే చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరోసారి అలాంటి కామెంట్స్ చేసి కష్టాల్లో పడ్డారు. ఏకంగా పహల్గాం ఉగ్రదాడిపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.విజయ్ దేవరకొండ పహల్గాం ఉగ్రదాడిపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు హైదరాబాద్ లోని న్యాయవాది లాల్ చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలన్నారు.పహల్గాం ఉగ్రదాడిపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు తీవ్రమైన ఆరోపనలు చేస్తున్నాయి. కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్ర దాడి వందల సంవత్సరాల క్రితం గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను పోలి ఉన్నాయి. అసలు 500 సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకున్నట్లు, వీళ్లు (ఉగ్రవాదులు) బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా పనులు చేస్తున్నారు అని విజయ్ దేవరకొండ అన్నారు. తాను ఖుషి సినిమా షూటింగ్ సమయంలో పహల్గాం సందర్శించానని అన్నాడు.

Exit mobile version